ఇగ్నో నుంచి ఎంబీఏ చేయాలంటే? -
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో), స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ దూరవిద్యా విధానంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు సూపర్వైజరీ/మేనేజీరియల్/సంబంధిత ప్రొఫెషనల్ హోదాలో మూడేళ్ల అనుభవం లేదా ఇంజనీరింగ్/టెక్నాలజీ/మెడిసిన్/ఆర్కిటెక్చర్/లా/ఫార్మసీ/అకౌంటెన్సీ/సీఎస్ లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీ. యూనివర్సిటీ నిర్వహించే ఓపెన్మ్యాట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
క్యాట్/మ్యాట్/రాష్ట్ర స్థాయిలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎంట్రెన్స్లలో క్వాలిఫై అయినవారికి ఓపెన్మ్యాట్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ పరీక్షను ఏటా రెండుసార్లు.. ఫిబ్రవరి, ఆగస్ట్లలో నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో నిర్వహించే పరీక్షకు అంతకుముందు సంవత్సరం నవంబర్ 30, ఆగస్ట్లో నిర్వహించే పరీక్షకు ఆ ఏడాది మే 31 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తులను యూనివర్సిటీ స్టడీసెంటర్లు లేదా వెబ్సైట్ నుంచి పొందొచ్చు. వివరాలకు: www.ignou.ac.in
.....................
పీజీ డిప్లొమా ఇన్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లేవి?
-స్వరూప్, నాగర్కర్నూలు.
మన రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టాక్సేషన్ కోర్సును అందిస్తోంది. అర్హత: బీకాం. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్సైట్: www.osmania.ac.in
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ -సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఘజియాబాద్ ఏడాది వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్ టాక్సేషన్ కోర్సును దూరవిద్య విధానంలో అందిస్తోంది.
వివరాలకు: www.imtcdl.ac.in
అన్నామలై యూనివర్సిటీ-డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, తమిళనాడు పీజీ డిప్లొమా ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సును డిస్టెన్స్లో ఆఫర్ చేస్తోంది.
http://annamalaiuniversity.ac.in
......................
ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఉంది. వివరాలు తెలపండి?
- విజయ్, గోదావరిఖని.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఏటా నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ (సీజీఎల్ఈ) ద్వారా ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ హోదాలో ప్రవేశించవచ్చు. సెంట్రల్ ఎక్సైజ్/ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్లలో ఇన్స్పెక్టర్/ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులను కూడా ఈ పరీక్ష ద్వారానే భర్తీ చేస్తారు. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ (సీజీఎల్ఈ) టైర్-1, టైర్-2, ఇంటర్వ్యూ అనే మూడు దశలతో కూడిన ప్రక్రియ ఉంటుంది. టైర్-1, 2 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉండే రాత పరీక్షలు. ఇందులో క్వాలిఫై అయినవారు తర్వాతి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్కు హాజరు కావాలి.
టైర్-1 రాత పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. సమయం రెండు గంటలు. నాలుగు విభాగాలుగా ఉంటుంది. అవి..
జనరల్ ఇంటెలిజెన్స్ (50 మార్కులు);
జనరల్ అవేర్నెస్ (50 మార్కులు);
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు);
ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్(50 మార్కులు);
ఈ దశలో క్వాలిఫై అయినవారిని మాత్రమే టైర్-2కు అనుమతిస్తారు.
టైర్-2 పరీక్షకు 400 మార్కులు కేటాయించారు. రెండు విభాగాలుగా ఉంటుంది. అవి..
అర్థమెటిక్ ఎబిలిటీస్(200 మార్కులు-సమయం రెండు గంటలు);
ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ (200 మార్కులు-
సమయం రెండుగంటలు);
చివరి దశ ఇంటర్వ్యూ.
సంబంధిత నోటిఫికేషన్ కోసం ఎంప్లాయ్మెంట్ న్యూస్ లేదా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
వెబ్సైట్: http://ssc.nic.in/ చూడొచ్చు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో), స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ దూరవిద్యా విధానంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు సూపర్వైజరీ/మేనేజీరియల్/సంబంధిత ప్రొఫెషనల్ హోదాలో మూడేళ్ల అనుభవం లేదా ఇంజనీరింగ్/టెక్నాలజీ/మెడిసిన్/ఆర్కిటెక్చర్/లా/ఫార్మసీ/అకౌంటెన్సీ/సీఎస్ లేదా ఏదైనా మాస్టర్ డిగ్రీ. యూనివర్సిటీ నిర్వహించే ఓపెన్మ్యాట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
క్యాట్/మ్యాట్/రాష్ట్ర స్థాయిలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎంట్రెన్స్లలో క్వాలిఫై అయినవారికి ఓపెన్మ్యాట్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ పరీక్షను ఏటా రెండుసార్లు.. ఫిబ్రవరి, ఆగస్ట్లలో నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో నిర్వహించే పరీక్షకు అంతకుముందు సంవత్సరం నవంబర్ 30, ఆగస్ట్లో నిర్వహించే పరీక్షకు ఆ ఏడాది మే 31 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తులను యూనివర్సిటీ స్టడీసెంటర్లు లేదా వెబ్సైట్ నుంచి పొందొచ్చు. వివరాలకు: www.ignou.ac.in
.....................
పీజీ డిప్లొమా ఇన్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లేవి?
-స్వరూప్, నాగర్కర్నూలు.
మన రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టాక్సేషన్ కోర్సును అందిస్తోంది. అర్హత: బీకాం. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్సైట్: www.osmania.ac.in
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ -సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఘజియాబాద్ ఏడాది వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్ టాక్సేషన్ కోర్సును దూరవిద్య విధానంలో అందిస్తోంది.
వివరాలకు: www.imtcdl.ac.in
అన్నామలై యూనివర్సిటీ-డెరైక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, తమిళనాడు పీజీ డిప్లొమా ఇన్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సును డిస్టెన్స్లో ఆఫర్ చేస్తోంది.
http://annamalaiuniversity.ac.in
......................
ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఉంది. వివరాలు తెలపండి?
- విజయ్, గోదావరిఖని.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఏటా నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ (సీజీఎల్ఈ) ద్వారా ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ హోదాలో ప్రవేశించవచ్చు. సెంట్రల్ ఎక్సైజ్/ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్లలో ఇన్స్పెక్టర్/ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులను కూడా ఈ పరీక్ష ద్వారానే భర్తీ చేస్తారు. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ (సీజీఎల్ఈ) టైర్-1, టైర్-2, ఇంటర్వ్యూ అనే మూడు దశలతో కూడిన ప్రక్రియ ఉంటుంది. టైర్-1, 2 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉండే రాత పరీక్షలు. ఇందులో క్వాలిఫై అయినవారు తర్వాతి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్కు హాజరు కావాలి.
టైర్-1 రాత పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. సమయం రెండు గంటలు. నాలుగు విభాగాలుగా ఉంటుంది. అవి..
జనరల్ ఇంటెలిజెన్స్ (50 మార్కులు);
జనరల్ అవేర్నెస్ (50 మార్కులు);
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ (50 మార్కులు);
ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్(50 మార్కులు);
ఈ దశలో క్వాలిఫై అయినవారిని మాత్రమే టైర్-2కు అనుమతిస్తారు.
టైర్-2 పరీక్షకు 400 మార్కులు కేటాయించారు. రెండు విభాగాలుగా ఉంటుంది. అవి..
అర్థమెటిక్ ఎబిలిటీస్(200 మార్కులు-సమయం రెండు గంటలు);
ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ (200 మార్కులు-
సమయం రెండుగంటలు);
చివరి దశ ఇంటర్వ్యూ.
సంబంధిత నోటిఫికేషన్ కోసం ఎంప్లాయ్మెంట్ న్యూస్ లేదా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
వెబ్సైట్: http://ssc.nic.in/ చూడొచ్చు
No comments:
Post a Comment