ప్ర ః
- ప్రసాద్, నల్లగొండ.
జ ః బిఇడి కరస్పాండెన్స్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ) ద్వారా చేయొచ్చు. ఇందుకుగాను అభ్యర్థి కనీసం రెండు సంవత్సరాల బోధన అనుభవం కలిగి ఉండాలి. అడ్మిషన్ల కోసం ఆయా యూనివర్శిటీలు విడిగా ప్రవేశ పరీక్ష నిర్వహస్తాయి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీకి ట్యూషన్ ఫీజుగా రూ.18 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
ప్ర ః నాకు బిపిఓ ఉద్యోగం చేయాలని ఉండి. ఐఎల్ & ఎఫ్ఎస్ అనే సంస్థ STEEP ద్వారా ఉచిత బిపిఓ శిక్షణ, ఉద్యోగాలు, ఉచిత వసతి అని చదివాను. వాళ్లు మళ్లీ ఏమైనా డబ్బులు కట్టమంటారా? దయచేసి వివరాలు తెలుపగలరు?
- ప్రణవ్, జగిత్యాల.
జ ః కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో ప్రయివేటు సంస్థలను కూడా భాగస్వాములు చేసింది. అందులోభాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ఐఎల్ & ఎఫ్ఎస్ వారి STEEP అనే సంస్థ తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న 18-30 ఏళ్ల యువకులకు స్కిల్స్ ఫర్ ఎంప్లాయిమెంట్ ఇన్ సర్వీస్ సెక్టార్ పేరుతో కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్స్కిల్స్, టైపింగ్, అనలిటికల్ స్కిల్స్, రిటైల్ మార్కెటింగ్ స్కిల్స్ మొదలైన వాటిలో నెల రోజులపాటు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు. వీరికి నెలకు రూ.2,000ల స్టయిఫండ్ కూడా చెల్లిస్తారు. ఈ సంస్థ కార్యాలయం STEEP అమీర్పేటలోని సారథి స్టూడియో వద్ద ఉంది. ఫోన్ నెం.040-40040919. ఇలాంటి సంస్థలు నగరంలో వివిధ ప్రాంతాల్లో శిక్షణ కల్పిస్తున్నాయి.
ప్ర ః నేను బి.ఎస్సీ (బయోటెక్) ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఆర్మీలో చేరాలని ఉంది. ఈ మధ్యనే అప్లయ్ చేశాను. ఈవెంట్లకి ప్రిపేర్ అవుతున్నాను. ఈవెంట్ల తర్వాత రిటెన్ టెస్టు గురించి భయంగా ఉంది. అందులో ఉండే ప్రశ్నలు, మోడల్ పేపర్లు మొదలైన వివరాలు తెలపగలరు?
- ఎం.శ్రీనివాస్, మంథని
జ ః ఆర్మీలో సోల్జర్ రిక్రూట్మెంట్కు పదో తరగతి ఉత్తీర్ణులై 16-20 ఏళ్ల మధ్య వయస్సు ఉంటే సరిపోతుంది. శారీరక పరీక్షల తర్వాత రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయబడుతుంది. రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్పై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. మొత్తం మార్కులు 100. ఎంపిక కావడానికి కనీస మార్కులు 32 మాత్రమే. పరీక్ష పేపరు పదో తరగతి స్థాయిలో ఉంటుంది. బుక్షాపులలో పాత ప్రశ్నపత్రాలు లభ్యమవుతాయి.
ప్ర ః నేను వినాయక మిషన్ యూనివర్శిటీ ద్వారా డిస్టెన్స్మోడ్లో ఎంఎల్ఐఎస్సి (m.l.i.sc.) పూర్తి చేశాను. నేను జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలల్లో లైబ్రేరియన్ జాబ్స్కి అప్లయ్ చేయవచ్చా?
- ఎ.రఘు, పెద్దపల్లి.
జ ః డిస్టెన్స్మోడ్లో (దూరవిద్య) ద్వారా ఆఫర్ చేసే కోర్సులు అన్నీకూడ (డిఇసి) డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారిచే గుర్తించబడి ఉండాలి. వినాయక మిషన్ యూనివర్శిటీ వారు ఆఫర్ చేసే ఎంఎల్ఐఎస్సి కోర్సుకు డిఇసి వారి గుర్తింపు ఉంది. కాబట్టి మీరు లైబ్రేరియన్ ఉద్యోగానికి అర్హులు.
ప్ర ః నేను పాలిటెక్నిక్ (ఇఇఇ) రెండో సంవత్సరం చదువుతున్నాను. మూడో సంవత్సరం పూర్తయిన తర్వాత ఐఐటి/ఎఐఇఇఇలలో బి.టెక్ చేయాలని ఉంది. అలా చేయడం సాధ్యమేనా? వివరాలు తెలపండి?
- జి.మోహన్నాయక్, బేలెల్.
జ ః ఐఐటి/ఎఐఇఇఇలలో బి.టెక్ చేయాలంటే ఇంటర్మీడి యట్ (10+2) ఉత్తీర్ణులై ప్రవేశ పరీక్షకు కావాలి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారికి ‘ఈసెట్’ పరీక్ష ద్వారా నేరుగా బి.టెక్ రెండో సంవత్సరంలోకి ప్రవేశం పొందవచ్చు.
No comments:
Post a Comment