పాలిసెట్-2013
పదో తరగతి తర్వాత ఎన్నో అవకాశాలు.. మరెన్నో ప్రత్యామ్నాయాలు.. మారుతున్న ప్రపంచంలో టెక్నికల్ విద్యకు ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో.. అందుకు మొదటి మెట్టుగా నిలిచేవి పాలిటెక్నిక్ కోర్సులు.. ఈ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)-
2013 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. సంబంధిత వివరాలు..
పరీక్షా విధానం:
పాలిసెట్లో మొత్తం 120 ప్రశ్నలు ఉంటా యి.వీటికి ఒక్కొక్క మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. రెండు గంటల్లో (120 నిమిషాల్లో) సమాధానాలను గుర్తించాలి. మొత్తం మూడు సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. అవి.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సబ్జెక్ట్ల వారీగా ప్రశ్నల విభజనను పరిశీలిస్తే..
మ్యాథమెటిక్స్ -60 ప్రశ్నలు
ఫిజిక్స్ -30 ప్రశ్నలు
కెమిస్ట్రీ -30 ప్రశ్నలు
పాలిసెట్తో:
పాలిసెట్తో ర్యాంకుతో రాష్ట్రంలో దాదాపు 360 కి పైగా ఉన్న పాలిటెక్నిక్లలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, తదితర ఇంజనీరింగ్ బ్రాంచ్లలో డిప్లొమా కోర్సులలోకి అడుగుపెట్టొచ్చు. ఫలితంగా భవిష్యత్తులో ఇంజనీరింగ్ దిశగా అడుగులు వేయొచ్చు. మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్)లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశించొచ్చు. ఉపాధి అవకాశాలు కూడా అధికమే. డిప్లొమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణులను పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు ట్రైనీలుగా నియమించుకుంటున్నాయి.
దరఖాస్తు విధానం:
అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో రూ. 20 చెల్లించి పాలిసెట్ దరఖాస్తులను పొందొచ్చు. లేదా రూ. 330 చెల్లించి ఏపీ ఆన్లైన్ సెంటర్లు, హెల్ప్ లైన్ సెంటర్లు, ఈ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పాలిసెట్ -2013 సమాచారం:
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
(2013లో హాజరైన వారు కూడా అర్హులే.)
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2013
పాలిసెట్ తేదీ: మే 2, 2013
వెబ్సైట్: https://sbtetap.gov.in
No comments:
Post a Comment